![]()
భద్రాచలం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి
పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం, జూన్ 16 (మన భద్రాద్రి న్యూస్):
భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని గ్రామాభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు తదితర అంశాలపై సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ రత్నం కవిత, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావులకు ఎమ్మెల్యే సూచించారు.
ఈ సమావేశంలో వార్డు సభ్యులు చెంచు సుబ్బారావు, బొంబోతుల రాజీవ్, బొంత రమణ, బండారు శరత్ బాబు, నర్రా వాణి, అబ్బినేని వీణిల రాణి, కావూరి గోపి, పెద్దినేని లక్ష్మి, కారం సుజాత, నిట్టా రాజు, భుక్య సుశీల, కారం దుర్గారావు, తాటి ఉదయ్, ఇనమల అశోక్, సున్నం ఈశ్వరి, సున్నం భూలక్ష్మి, జగ్గా కుమారి, తుర్రం మహేష్, ఇర్పా అనసూయ, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








